Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 45 మంది విద్యార్థులకు అస్వస్థత
- కల్వకుర్తి గురుకులంలో ఘటన
నవతెలంగాణ - కల్వకుర్తి
అల్పాహారం వికటించి 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో గురువారం జరి గింది. తల్లి దండ్రుల వివరాల ప్రకారం.. కల్వకుర్తి సమీపంలోని జయప్రకాశ్న గర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉదయం అల్పాహారంలో విద్యార్థులకు కిచిడి వడ్డించారు. అది తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు విరేచనాలు మొదలయ్యాయి. గమనించిన పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది.. విద్యార్థులను వెంటనే కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థులకు విరేచనాలు అయ్యాయి. ప్రస్తుతం వారందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా పాఠశాలలో మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదని, అన్నంతో పాటు కూరలు నాసిరకంగా ఉంటున్నాయని విద్యార్థులు తెలిపారు. గుడ్లు, పండ్లు ఇవ్వడం పూర్తిగా మానేశారని, ఈ విషయం ప్రిన్సిపాల్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వివరించారు. గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.