Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో అతి పెద్ద శాఖల్లో ఒకటైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డాక్టర్ రవిశంకర్ నియమితులయ్యారు. ఈ నెల 18న నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల కమిషన్ చైర్మెన్ డాక్టర్ ప్రదీప్ స్వరూప్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రవిశంకర్ ఐఎంఏ నగర శాఖలో కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. కాగా, హైదరాబాద్ నగర శాఖలో 2018-19 సంవత్సరానికి గాను ఆగస్టు 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు 5 వేల వైద్యులు సభ్యులుగా, నగరంలోని పేరు మోసిన వైద్యులు చాలా వరకు ఈ శాఖలో సభ్యులే కావడం విశేషం. మిగతా పోస్టులకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. 2018-19 సంవత్సరానికి గాను గత సంవత్సరం ఎన్నికైన డాక్టర్ మోహన్ గుప్తా అధ్యక్షునిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ ఐఎంఏ హైదరాబాద్ శాఖ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు. అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.