Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ పరిస్థితి ఎలా ఉంది
- డీసీసీలకు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ప్రశ్నలు
- అనుబంధ సంఘాలకు సీట్లలో కోటా...
- 35 సీట్లు అడిగిన టీపీసీసీ ఓబీసీ విభాగం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'వచ్చే ఎన్నికల్లో మీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల సానుకూల వాతావరణం ఉందా? ఆయా నియోజకవర్గాల్లో బలబలాలు ఏంటి. స్థానికంగా నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏమిటి? మీరు చేస్తున్న కార్యక్రమాలు ఎలా ఉన్నాయి.?' ఉమ్మడి జిల్లాల అధ్యక్షులను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ ప్రశ్నలు సంధించింది. అనుబంధ సంఘాల పనితీరుపై ఎలా ఉందంటూ ఆరా తీసినట్టు తెలిసింది. గురువారం ఇందిరా గాంధీభవన్లో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఉమ్మడి పది జిల్లాల అధ్యక్షులతో సమావేశమై...పలు అంశాలపై చర్చించారు. నల్లగొండ, మహబూగ్నగర్, వరంగల్ జిల్లాల అధ్యక్షులు మాత్రం ఎన్ని సీట్లు గెలుస్తామని, నల్లగొండలో భువనగిరి, వరంగల్లో భూపాలపల్లి, పరకాల, మహబూబ్నగర్లో నాగర్కర్నూల్ నియోజకవర్గాలు మినహా అన్ని సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని రిపోర్టు ఇచ్చినట్టు సమాచారం. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఫలితాలు భిన్నంగా వచ్చే అవకాశం ఉందని చెప్పినట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఫలితాలు ఉంటాయని ఆయా జిల్లాల అధ్యక్షులు చెప్పారు. రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువ సీట్ల పొత్తుల్లో భాగంగా ఆయా పార్టీలకు పోతాయని, కాంగ్రెస్కు కేటాయించే సీట్లలో కచ్చితంగా గెలుస్తుందని వివరించారు. అన్ని జిల్లాల అధ్యక్షులు మాత్రం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ముఖ్యంగా బీసీలకు 35 మంది సీట్లు కేటాయించాలని టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మెన్ చిత్తరంజన్దాస్ నేతృత్వంలో బృందం స్క్రీనింగ్ కమిటీ ముందుంచింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బీసీలు, మైనార్టీలకు జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలని కోరింది. ఈ విషయంలో రాహుల్గాంధీ సానుకూలంగా ఉన్నట్టు స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ భక్తచరణ్దాస్ గుర్తు చేసినట్టు తెలిపారు.