Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటర్ల నమోదు గడువు పెంచాలి
- రజత్కుమార్కు టీఎస్సీపీఎస్ఈయూ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గంలోని ఓటర్ల నమోదుకు గడువు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్కుమార్ను టీఎస్సీపీఎస్ఈయూ అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు చివరి తేది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించాలని కోరారు. దాదాపు 80 శాతం ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరూ ఎన్నికల విధుల్లో నిమగమై నమోదులో జాప్యం జరుగుతోందని తెలిపారు. తేది పొడగించడం వల్ల నమోదు ఎక్కువవ్వడంతో పాటు ఓటింగ్ శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఓటు నమోదుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ప్రత్యేక యాప్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేయాలని తెలిపారు. దీనికి రజత్కుమార్ సానుకూలంగా స్పందించారని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు మల్లికార్జున్, రవిచంద్ర పాల్గొన్నారు.