Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ సభ్యత్వమే లేని వ్యక్తికి టికెట్
- ప్రజలకు ఎంతో సేవ చేసినా నాకు నిరాశే మిగిలింది: మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్
నవతెలంగాణ-సంగారెడ్డి టౌన్
'ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎంతో నమ్మా. కానీ నమ్మిన గాడ్ఫాదరే రోడ్డున పడేశాడు. 25ఏండ్లుగా రాజకీయంగా ఉన్న. ఆందోల్ ప్రజలకు ఎంతో సేవ చేశా. చివరకు నాకు టీఆర్ఎస్లో అవమానం జరిగింది. టిక్కెట్ ఇవ్వకుండా నమ్మించి నా గొంతు కోసినంత పనిచేశారు' అని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ కంటతడి పెట్టారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లా డారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి 25ఏండ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. ఆందోల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో ఎన్నో అభివద్ధి పనులు చేశానన్నారు. పైసా ఆశించకుండా నిరంతరం ప్రజాసేవకు పరితపించానని చెప్పారు. ఆందోల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తనకు టికెట్ ఇవ్వకుండా పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి మొదటి విడతలోనే సీటు కేటాయించి తనను అవమానానికి గురి చేశారన్నారు. టిక్కెట్ తనకెందుకు ఇవ్వలేదని అడిగేందుకు కేసీఆర్కు ఎన్నోసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తాను చేసిన తప్పు ఏమన్నా ఉంటే అదైనా చెప్పి చర్య తీసుకున్నా బాధపడే వాడిని కాదన్నారు. బ్లాక్ మెయిల్ చేసిన వాళ్లకు టీఆర్ఎస్ టిక్కెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అధిష్టానం తనకు ఫోన్చేసి 'బాబుమోహన్ ఎలా ఉన్నావ్?' అని ఒక్కసారి కూడా అడగలేదన్నారు. ఏ మాత్రం అవినీతి చేయకుండా, నిరంతరం ప్రజల్లో ఉండి వారి కష్టనష్టాల్లో పాలు పంచుకోవడమే తాను చేసిన తప్పా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ దళితులకు, బీసీలకు అండగా ఉండే పార్టీ అన్నారు. తనను ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానని, ప్రజాసేవే లక్ష్యమని చెప్పారు. ఇక నుంచి ఆందోల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తామన్నారు.