Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం
- టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కార్మికులు పని చేయాలి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి
నవతెలంగాణ - రాంనగర్
తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. ఆర్టీసీ లాభనష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని, దానికి కార్మికులకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆర్.కష్ణయ్య మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఆర్టీసీ కార్మికులు పని చేయాలని పిలుపుని చ్చారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకులు బండ్ల గణేష్, తెలంగాణ కళాశాల సంఘం అధ్యక్షులు గౌరీ సతీష్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ కష్ణ, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ పాల్గొన్నారు.