Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - షాద్నగర్ రూరల్
నీటి సమస్య పరి ష్కరించకుండా ఓట్లు అడిగేందుకు వస్తారా.. అంటూ తండావాసులు టీఆర్ఎస్ ప్రచార రథంపై దాడి చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం గంట్లవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవునిబండతండాలో గురువారం జరిగింది. రథానికి ఉన్న ఫ్లెక్సీలు, పోస్టర్లను చింపేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ ప్రచార రథాన్ని తీసుకుని ఆ పార్టీ నాయకులు దేవునిబండ తండాకు వచ్చారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్య పరిష్కరించడంలో నేతలు పూర్తిగా విఫలమయ్యారని, వారిని ఎన్నిసార్లు కలిసినా స్పందించడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే మా తండా గుర్తుకొస్తదా అంటూ ప్రచార రథంపై దాడి చేశారు. కొందరు నాయకులు గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేశారు.