Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనగా హైదరాబాద్లో రాస్తారోకో
నవతెలంగాణ- మలక్పేట
హైదరాబాద్లోని ఎల్బీ నగర్ వద్ద గల ఎన్టీఆర్ మార్కెట్లో కూరగాయలు విక్రయించే రైతులపై రిటైల్ వ్యాపారులు గురువారం ఉదయం దాడి చేశారు. దీన్ని నిరసిస్తూ రైతులు రాస్తారోకో చేశారు. అకారణంగా తమపై దాడి చేశారంటూ కూరగాయలు రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. తమపై నిత్యం దాడులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల నుంచి అనేక మంది రైతులు పంటలను ఎన్టీఆర్ నగర్, వనస్థలిపురం, సరూర్నగర్ రైతు బజార్లకు తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారన్నారు. రోజువారీ మాదిరి గానే రైతులు ఎన్టీఆర్ నగర్ మార్కెట్ వద్ద సర్వీస్ రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటుండగా, అకస్మాత్తుగా మార్కెట్లో ఉంటున్న రిటైల్ వ్యాపా రులు రైతులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలన్నీ రోడ్లపై పారబోసి తొక్కారని తెలిపారు. కొంత కాలంగా ఎన్టీఆర్ నగర్ మార్కెట్ రిటైల్ వ్యాపారులు రైతులపై ఏదో రకంగా దాడులు చేస్తున్నారని అన్నారు. రైతులపై దాడి జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ సిబ్బంది పట్టించుకోలేదని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులపై దాడికి పాల్పడిన వారి లైసెన్స్ రద్దు చేయాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.