Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతలబేంటి ?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ దామోదర రాజనర్సింహా భార్య పద్మినీరెడ్డి బీజేపీలో చేరిన కొద్ది గంటల్లోనే సొంతగూటికి చేరి పోయారు. ఒకవైపు కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ విషయమై చర్చ జరుగుతుండగా, మరోవైపు బీజేపీ మా త్రం కంగుతిన్నది. ఇందులో ఎదో మతులబు ఉందనే ప్రచారం గాం ధీభవన్లోనే జరుగుతున్నది. దామో దర రాజనర్సింహా వ్యూహం ప్రకారమే పద్మినీరెడ్డి మొదట కా షాయకండువా కప్పుకున్నారని సమాచారం. ఆమె సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అసెంబ్లీ సీటును అడు గుతున్నారు. అయితే ఒకే కుటుంబానికి ఒకే టికెట్ విధానం నేపథ్యంలో ఆ ప్రతిపాదనను టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ పక్కన పడేసిందని సమాచారం. కాగా మరోవైపు జానారెడ్డి, డికె అరుణ, సబి తారెడ్డి తది తర కుటుంబాలకు రెండు టికెట్లు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో తమను నిర్లక్ష్యం చేయడాన్ని దామోదర రాజ నర్సింహా కటుంబం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఆ టికెట్ సాది óంచేందుకే పద్మినీరెడ్డిని బీజేపీ శిబిరానికి పంపినట్టే పంపి, రాజనర్సింహా మళ్లీ వెనక్కి రప్పించారని అంటున్నవారు లేకపోలేదు. ఈ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రామచంద్ర కుంతి యాతోపాటు ఏఐసీసీ అధిష్టానానికి సమాచారం చేరవేసినట్టు సమాచారం.