Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
- 2000 బైకులతో భారీ ర్యాలీ.. ప్రతి గ్రామంలో 'కోట' కు అపూర్వ ఆదరణ
నవతెలంగాణ-చింతకాని
బోడేపూడి వెంకటేశ్వరరావు కాలం నాటి అపూ ర్వమైన పాలన మళ్లీ పునరావృతం కావాల ంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపర్చిన బీఎల్పీ అభ్యర్థి కోట రాంబాబును గెలిప ించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు అన్నారు. కోట రాంబా బు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఖమ్మం జిల్లా చింతకాని మండల వ్యాప్తంగా సుమారు రెండు వేల మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాతర్లపాడులో పోతినేని, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు సామినేని రామారావు బీఎల్ఎఫ్, సీపీఐ(ఎం) జెండాలు ఊపి ర్యాలీని ప్రారంబి óంచారు. ఈ సంధర్భంగా పోతినేని మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎనలేని అభివృద్ధి జరిగిందని, అతను కట్టించిన బోడేపూడి సుజలస్రవంతి మంచినీటి ప్రాజెక్టు నేటికీ సేవలందిస్తోందని గుర్తుచేశారు. మరలా అలాంటి అభివృద్ధి జరగాలంటే అందుకు అర్హుడు కోటరాంబాబు మాత్రమేన న్నారు. మధిర ఎమ్మెల్యేగా ప్రజలు పదేండ్లు భట్టి విక్రమార్కకు అవకాశం ఇస్తే అసంపూర్తి రోడ్లు, కళతప్పిన ప్రాజెక్టులు, నాసిరకం పనులతో నియోజకవర్గం అంధవికారంగా తయారైందని అన్నారు. సామాన్య ప్రజానీకానికి అందుబాటు లో ఉండకుండా కేవలం తన అనంగు అనుచరు లు, కాంగ్రెస్ నాయకులకు అందుబాటులో ఉండి సొంత పనులు చక్కబెట్టు కోవడంతోనే భట్టికి సరిపోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజు గతంలో గల్లీల్లో తిరు గుతుంటే సీపీఐ(ఎం) ఆదుకొని అక్కున చేర్చుకొని, పార్టీలో ముఖ్య పదవులిచ్చి సమాజ ంలో ఒక గుర్తింపు తెచ్చిందని గుర్తు చేశారు. ఈనాడు ఓ బడా కాంట్రా క్టర్ గడిలో పాలేరుగా చేరిన నీకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
బీఎల్పీ అభ్యర్థి కోట రాంబాబు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు ధనానికి, ఆత్మాభిమానానికి మధ్య జరగను న్నాయని తెలిపారు. మధిరలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓటర్లును కొనేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కానీ మధిర ప్రజలు ఆత్మాభిమానం కలవారని, అభివృద్ధికి పాటుపడే నాయకుడిని వారు ఆదరిస్తారని అన్నారు. జిల్లా నాయకులు సామినేని రామారావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో నాగలి దున్నుతున్న రైతు గుర్తుకు ఓటేసి రాంబా బును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, చింతలచెర్వు కోటేశ్వరరావు, కోండ్రు జానకి రామయ్య, ఎంపీటీసీ కాటబత్తిన వీరబాబు, తిరుపతి అంజయ్య, వేముల నర్సయ్య, మద్దిన్ని బస్వయ్య, రాచబంటి రాము పాల్గొన్నారు.