Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • నగర పోలీసులపై అమెరికన్ కాన్సులేట్ జనరల్ ప్రశంసలు
  • పోషకాహారంపై ఎన్‌ఐఎన్ ఈ లెర్నింగ్ కార్యక్రమం..
  • నేను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తా...
  • లండన్‌ బయలుదేరిన జగన్‌..
  • బీసీ స్టడీ సర్కిల్‌ దరఖాస్తుల ఆహ్వానం..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
కారు మబ్బులు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

కారు మబ్బులు..

Fri 12 Oct 04:39:13.922413 2018

- బార్డర్‌ చేరుతుందా.. లేదా...?
- 35 నియోజకవర్గాల్లో కుమ్ములాటలు
- అమాత్యులపైనే పోటీకి దిగుతామంటున్న రెబెల్స్‌
- గతఎన్నికల్లోనే సాధారణ మెజారిటీతో గెలిచాం
- ఈసారి పరిస్థితి  ఎలా ఉంటుందో...?
- గులాబీ నేతల్లో అంతర్మథనం
ఇటీవల వచ్చిన ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలోని 119 స్థానాల్లో 100కు పైగా సీట్లు కారు గెలుచుకుంటుందని తేలింది. ఓ పదో, పదిహేను సీట్లు మాత్రమే ఇతరులకు పోతాయి... ఇటీవల నల్లగొండ బహిరంగ సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలివి. మీడియా ముందుకొచ్చిన ఏ టీఆర్‌ఎస్‌ నాయకుణ్ని పలకరించినా తమకు నూరు సీట్లు పక్కా అని చెబుతున్నారు. గులాబీ నేతలందరూ పైకి ఇంత గంభీరంగా మాట్లాడుతున్నా లోలోన మాత్రం గుబులుతో ఉన్నారని వినికిడి. వారి అంతర్గత సమావేశాల్లో సైతం ఇదే చర్చ కొనసాగుతున్నట్టు తెలిసింది.
* బివిఎన్‌ పద్మరాజు
తెలంగాణ ఉద్యమం ముగిసి.. రాష్ట్రం ఆవిర్భ వించిన 2014లో కారు పార్టీ మంచి జోరు మీదున్నది. ఆ యేడాది శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు వచ్చిన సంగతి విదితమే. అంటే సాధారణ మెజారిటీతో కేసీఆర్‌ సర్కారు ఏర్పాటైంది. ఇది గతం.. ఇప్పుడు పరిస్థితి మారింది కదా..? అలాంటప్పుడు ఆ సాధారణ మెజారిటీనైనా సాధించగలమా...? అనే సందే హాలు ఇప్పుడు గులాబీ సైన్యంలో నెలకొన్నాయి. పలువురు మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలు సైతం ఇదే అంశంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. వారిలో నెల కొన్న గుబులుకు కారణాలు లేకపోలేదు. శాసనసభను రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను కేసీఆర్‌ ప్రక టించినప్పటికీ కథ అంతటితో ముగియలేదు. కేసీఆర్‌ ప్రకటించిన తొలి జాబితాలోని నియోజకవర్గాల్లో 35 స్థానాల్లో కుమ్ములాటలు నెలకొన్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ఇవి మరింత తీవ్రరూపం దాల్చుతుండటం గమనార్హం. మరోవైపు టిక్కెట్లు దక్కనివారు ఏకంగా మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలపైనే రెబల్స్‌గా పోటీకి దిగుతామంటూ హెచ్చరిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ శంకరమ్మ మంత్రి జగదీశ్‌రెడ్డిపై రెబెల్‌గా బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం ఊపందుకున్నది. ఇదే సమయంలో ప్రతి జిల్లాలోను, ప్రతి నియోజకవర్గంలోనూ అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. పలువురు మంత్రులు సైతం తమ అనుయాయులకు టిక్కెట్లు దక్కలేదనే అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు రెండు, మూడు రోజుల నుంచి కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజల నిలదీతలు ఎక్కువయ్యాయి. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ ప్రచారం సందర్భంగా ప్రజలు నిలేశారు. నాలుగేండ్లుగా తమ గ్రామాలకు రాని వారు ఇప్పుడెందుకొచ్చారంటూ జనాలు ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించలేదంటూ వారు రేఖా నాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత సైతం ఇదే తరహాలో ప్రజల నుండి నిరసనను ఎదుర్కొన్నారు. తాజాగా గురువారం షాద్‌ నగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రచార రథాన్ని ప్రజలు ధ్వంసం చేశారు. ఇలాంటి పరిణామాలు అధికార పార్టీకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి.
ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేతల్లో కొంత ఆందోళన నెలకొంది. రాష్ట్ర స్థాయి నుంచి నియోజవర్గ స్థాయి వరకూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలిసింది. సీట్లు తక్కువొస్తే ఏం చేయాలి? ఒకవేళ కారు బార్డర్‌లో ఆగితే పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై వారు ఇప్పటి నుంచే సమాలోచనలు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్‌ఐఎమ్‌తో దోస్తీకి కేసీఆర్‌ ప్లాన్‌ చేసుకుంటూ వచ్చారని అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత చెప్పారు. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్‌కు మరో సమస్య వచ్చి పడే అవకాశముంది. ప్రస్తుతం ఎమ్‌ఐఎమ్‌కు ఉన్న ఏడు స్థానాలు వస్తే ఓకే.. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. హైదరాబాద్‌ పరిధిలోని మలక్‌పేట సీటుకు ప్రస్తుతం ఎమ్‌ఐఎమ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ స్థానం ఇప్పుడు మజ్లీస్‌ చేజారిపోయే అవకా శముందని విశ్లేషకుల అంచనా. ఇదే జరిగితే అధికార పార్టీ నేతల్లో మరింత ఆందోళన నెలకొనటం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు.

rw-adx

టాగ్లు :
  • -1,
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

rw-adx

సంబంధిత వార్తలు

ఆదాయం మిగులును కాగ్‌ ప్రశ్నించింది..
ఎలాంటి అసంతృప్తి లేదు : హరీశ్‌రావు
క్యాబినెట్‌ 12
'భగీరథ'కు యూజర్‌ చార్జీలు
అగ్నినివారణ చర్యల్లేనప్పుడు ఎగ్జిబిషన్‌ ఎందుకు ?
దళిత సర్పంచ్‌కు అవమానం
ఆ 50 లక్షలు ఎక్కడివి ?
100 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత
రెండో రోజు సమ్మె విజయవంతం
కేసీఆర్‌ మాట నిలబెట్టుకున్నారు: ఎర్రబెల్లి
రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి
దళితులవి సమస్యలు కావా?
శ్రీరామగిరి స్పిన్నింగ్‌మిల్లులో అగ్ని ప్రమాదం
మాకెందుకు పరిహారమివ్వరు?
సీపీఐ(ఎం)తో కలిసి పోటీకి సిద్ధం
యూనిట్లు పెంచాలని లబ్దిదారుల ఆందోళన
ఉగ్ర ఎత్తుగడలపై 'ఆక్టోపస్‌'కు పాఠాలు
ఆర్టీవో కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం
స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి మృతి
3 కోట్ల భూమికి 36 లక్షలు!
జోగుకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసన
జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా
ఎస్‌ఐ వేధింపులతోనే దళితుడి మృతి
మూతపడిన కందుల కొనుగోలు కేంద్రం
వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్‌
చిన్నారులను చిదిమేస్తున్న నులిపురుగులు
ఏసీబీకి చిక్కిన వీఆర్‌ఓ
ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ వ్యవస్థాపక దినోత్సవం
మహిళలకు, ఎస్టీలకు చోటేది : దత్తాత్రేయ
26న ఆర్‌ఎమ్‌ ఆఫీసుల ఎదుట దీక్షలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.