Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) తెలుగు సబ్జెక్టుకు మరో 64 మంది అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఎంపిక చేసింది. ఎస్ఏ తెలుగుకు ఎంపికైన అభ్యర్థులకు రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఈనెల 24న మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎ వాణీప్రసాద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్ఏ తెలుగుకు 247 పోస్టులకు త్వరలోనే తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు ఎస్ఏ బయాలజీ సబ్జెక్టులో 62 మందికి అభ్యర్థులకు రెండో విడతలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ 22 సబ్జెక్టులకు సంబంధించి రాష్ట్రస్థాయి సవరణ జాబితాలను సోమవారం టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల్లో మార్పు లేదని ప్రకటించింది. పూర్తి వివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను సంప్రదించాలని కోరింది.