Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హర్యానా రోడ్వేస్లో 720 బస్సులను ప్రయివేట్ వ్యక్తులకు అప్పజెప్పాలన్న ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యుఎఫ్) డిమాండ్ చేసింది. ఆ ఉద్యోగులపై ఎస్మా ఉపసంహరించి, వెంటనే వారితో చర్చలు జరపాలని కోరింది. హర్యానా కార్మికులకు మద్దతుగా సోమవారం సంఘీభావదినంగా పాటించారు. బస్భవన్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి సిబ్బందికి కరపత్రాలు పంచారు. ఈసందర్బంగా ఎస్డబ్ల్యుఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్రావు మాట్లాడుతూ హర్యానా రాష్ట్రంలో ఆర్టీసీని రక్షించుకునేందుకు అక్కడి కార్మికులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. రవాణా శాఖ మంత్రి ఆఫీసు వద్ద ధర్నా చేస్తే వాటర్ క్యాన్స్, లాఠీచార్జి చేసి, అరెస్టులు చేసిందన్నారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా సమ్మెకు పిలు పునిస్తే కార్మికులపై ఎస్మా ప్రయోగించి 500 మందికిపైగా ఉద్యోగులను సస్పెండ్ చేసిందన్నారు. 400 మందికిపైగా కేసులు పెట్టి జైళ్లకు తరలించిందన్నారు. అనంతరం ప్రచార కార్యదర్శి రవీందర్రెడ్డి మాట్లాడుతూ హర్యానా రోడ్వేస్ ప్రభుత్వ డిపార్టుమెంట్గా ఉన్నప్పటికీ, నష్టాలపేరుతో మొత్తం రూట్లను వేలం వేయడం కోసం ప్రయత్నించిం దన్నారు. అదిసాధ్యం కాకపోతే స్కీం బస్సుల పేరుతో ప్రయి వేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేసిందన్నారు. దేశంలో ఆర్టీసీ కార్మికులెవరైనా రాజస్తాన్, హర్యానా కార్మి కుల పోరాటాలు రుజువు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ విధా నాల వల్ల వస్తున్న నష్టాలను ప్రభుత్వాలే భరిం చాలని కోరా రు. వామపక్షాలు మినహా పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్టీసీ తీవ్రమైన సంక్షో భావాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీని, ప్రభుత్వంలో విలీనం చేయాలని, దీంతో సంస్థకు, ఉద్యోగులకు ఎటువంటి ఢోకా ఉండదని చెప్పే మాటలు సరైనవి కావని, హర్యానా కార్మికుల పోరా టం రుజువు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్య్లుఎఫ్ కోశాధికారి ఎవి రావు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.