Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కె రోశయ్య హయాంలో మతకల్లోలాలు జరిగాయంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కేటీఆర్ వ్యాఖ్యలు రోశయ్యను అవమానించేలా ఉన్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి జి నిరంజన్ చెప్పారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రోశయ్య హయాంలో మతకల్లోలాలు జరిగాయని కేటీఆర్ అవివేకంతో మాట్లాడుతున్నారని చెప్పారు. రోశయ్య అనుభవంలో సగం కూడా నీ వయసు లేదని, అటువంటిది ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? అని ప్రశ్నించారు. రాజీవ్ సద్భావన యాత్రకు వచ్చిన రాహుల్గాంధీకి, రోశయ్యకు, ఇతర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.