Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాగజ్నగర్
ఇంటి ఎదుట ఆపి వున్న కారులో ఎక్కిన బాలుడు డోర్ లాక్ అయి ఊపిరి ఆడక మృతిచెందాడు. ఈ ఘటన కుమురంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో సోమవారం జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. విజయబస్తీకి చెందిన షేక్ రఫీక్ - షబనా దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అహద్(4) సోమవారం ఉదయం ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు వద్ద ఆడుకున్నాడు. ఆ సమయంలో కారు డోర్ తీసి ఎక్కాడు. అయితే, డోర్ లాక్ అయింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం, డోర్ తీయడం రాక అహద్ ఊపిరాడక మృతిచెందాడు. బాలుని కోసం కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి సాయంత్రం సమయంలో కారు దగ్గరకు వెళ్లి చూడగా నిర్జీవంగా పడి ఉన్న అహద్ కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు చనిపోయినట్టు చెప్పారు.