Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో రజాకార్ల వ్యతిరేక పోరాటం : మోత్కుపల్లి
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మహా, మాయా కూటములను ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని, బీఎల్ఎఫ్ బలపరిచిన ఆలేరు ఇండిపెండెంట్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులును గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సీపీఐ(ఎం), బీఎల్ఎఫ్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా చెరుపల్లి మాటా ్లడుతూ అవినీతి మచ్చలేని నాయకుడు మోత్కుపలి నర్సింహులు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నో కులదురహంకార హత్యలు జరిగాయని, బాధితులకు సీపీఐ(ఎం), బీఎల్ఎఫ్లు మద్దతుగా నిలిచా యని అన్నారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ దళితులకు తాను పంచిన భూములు టీఆర్ఎస్ నేతలు గుంజుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రూ. కోట్లు గడిస్తున్నారన్నారు. కష్టకాలంలో తనకు మద్దతు తెలిపిన బీఎల్ఎఫ్కు రుణపడి ఉంటానని అన్నారు. వారి కోసం, ప్రజల కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. ప్రభుత్వ విధా నాలను ప్రశ్నిస్తే పోలీసులచే అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని, మరో రజాకార్ల వ్యతిరేక పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. బిఎన్.రెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి బాటలో పయనించి జిల్లాకు సాగు నీరే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్డి జహంగీర్ మాట్లాడారు.
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు అధ్యక్షతన వహించిన ఈ సమావేశంలో ఆలేరు, మోటకొండూర్, ఆత్మ కూర్, యాదగిరిగుట్ట, గుండాల, బొమ్మలరామారం, తుర్కపల్లి సీపీఐ(ఎం) మండల కార్యదర్శులు మొరిగాడి రమేష్, బబ్బూరి పోశెట్టి, జయరాములు, మద్దెపురం రాజు, గోపాల్ రెడ్డి, కిష్టయ్య, పోతరాజు జహంగీర్ పాల్గొన్నారు.