Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెద్దపల్లి రూరల్
ఈత చెట్టుపై నుంచి పడి ఓ గీతకార్మికుడు చనిపోయాడు. ఈ ఘట న పెద్దపల్లి జిల్లా కేంద్ర సమీపంలోని తుర్కల మద్దికుంట గ్రామంలో సోమవారం జరిగింది. మృతుని బంధువుల వివరాల ప్రకారం.. తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన మడ్డి వెంకటేష్(36) ఎ ప్పటిలాగే కల్లు గీసేందుకు సో మవారం ఉదయం ఈత చెట్టు ఎక్కగా కాలు జారి కిందపడ్డాడు. ఈ క్రమంలో తలకు తీవ్ర గాయ మైంది. గమనించిన స్థానికులు హుటాహుటిన పెద్దపల్లి ప్రభు త్వాస్పత్రికి తరలిం చారు. ప్రాథ మిక చికిత్స అనం తరం మెరు గైన వైద్యం కోసం కరీంనగర్ తరలించే క్రమంలో మార్గం మధ్యలోనే పరిస్థితి విషమించి మరణించాడు. మృతుని భార్య ఉమారాణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.