Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పోచారంతో సీషెల్ దేశ వ్యవసాయ శాఖ మంత్రి చార్లస్ బాస్టేస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఆపధర్మ సీషెల్ దేశ వ్యవసాయ శాఖ మంత్రి చార్లస్బాస్టేస్ అన్నారు. అధికారిక పర్యటనలో బాగంగా రాష్ట్రానికి వచ్చిన సీషెల్ దేశ వ్యవసాయ శాఖ మంత్రి, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మంగళవారం క్యాంప్ కార్యాలయంలో కలిసారు. సీషెల్ దేశం ముఖ్యంగా పర్యాటక రంగం, చేపల ఉత్పత్తిపై ఆధారపడిన దేశమని, ఆ దేశ జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, మాంసం పూర్తిగా దిగుమతుల పైన ఆధారపడి ఉన్నదని బాస్టేన్ వివరించారు. ఈ సందర్బంగా మంత్రి పోచారం తెలంగాణా వ్యవసాయ రంగం గురించి సీషెల్ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణా రాష్ట్ర జనాబాలో 70 శాతం వ్యవసాయ రంగం పైనే ఆధారపడి ఉన్నదన్నారు. రాష్ట్ర జనాభాలో 58 లక్షల మంది రైతులు 1.10 కోట్ల ఎకరాలలో వివిద రకాల పంటలను పండిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న ప్రధాన పంటలన్నారు. రాష్ట్రంలో 400 ప్రవేటు విత్తనోత్పత్తి కంపెనీలు ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్ధసారది, కమిషనర్ రాహుల్ బొజ్జా, ఉద్యానశాఖ డైరెక్టర్ యల్. వెంకట్రామిరెడ్డి, సీడ్ కార్పోరేషన్ యం.డి. డా. కేశవులు, బేగంపేట ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.