Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎన్నికల అధికారికి దాసోజు లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళలను చైతన్య పరిచి, వారి ఓట్ల శాతాన్ని పెంచే నెపంతో 'గులాబీ రంగు' (పింక్బూత్ ) పోలింగ్ బూత్లను ప్రవేశపెట్టి ఒక పార్టీకి లబ్ది చేకూర్చే ప్రయత్నాన్ని వెంటనే నిలుపుదల చేయాలని టీపీసీపీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. మంగళవారం ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆయన లేఖ రాశారు. మహిళల ఓట్లు పెంచడం మంచి ప్రయత్నమే కానీ ఆ ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ జెండాకు చెందిన రంగుతో గులాబీరంగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు.