Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ పరీక్ష ఫీజు గడువును పొడగించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాదం తిరుపతి, కోటా రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం వారు ఇంటర్ బోర్డ్ కమిషనర్ అశోక్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 24 వరకు ఉన్న గడువును మరింత పొడిగించాలని కోరినట్టు తెలిపారు. సద్దుల బతుకమ్మ, దసరా పండగ సెలవులు దృష్ట్యా అనేక మంది విద్యార్థులు ఫీజు చెల్లించలేక పోయారన్నారు. గడువు పెంచకపోతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని.. ఇంటర్మీడియట్ బోర్డ్ స్పందించి తక్షణమే గడువు పొడిగించాలని సూచించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కండే విజేత, ఎండి జావేద్, హైదరాబాద్ నగర అధ్యక్షులు అశోక్ రెడ్డి, రాష్ట్ర నాయకులు క్రాంతి అనిల్ తదితరులు ఉన్నారు.