Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం కోసం వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కేంద్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంటి నుంచి తీసుకువెళ్లి.. తిరిగి ఇంటికి దగ్గర దిగబెట్టాలని సూచించారు. వికలాంగుల కోసం పోలింగ్ బూత్ల వద్ద ర్యాంప్, వీల్ ఛైర్, బ్రెయిలీ లిపిలో పోలింగ్ చిట్టీలు లాంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి మంగళవారం హోటల్ తాజ్ డక్కన్లో ప్రతిభావంత వికలాంగులైన శ్రావ్య, మహేందర్ వైష్ణవ్, జి మధు, టి వెంకటేశ్, అభినయా, తాండన్ బాలు నాయక్, నర్సింగ్రావు, సుజతాతో భేటీ అయ్యారు. వికలాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేయాలని ఓపీ రావత్ వారికి విజ్ఞప్తి చేశారు.