Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు కోరారు. బీసీలకు సీట్లు ఇస్తే గెలిచే అవకాశం లేదంటూ పార్టీలో కొంత మంది చేస్తున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. బీసీలకు పాతబస్తీలో సీట్లు ఇచ్చి చేతులుదులుపుకుంటామనే వైఖరి సరైందికాదన్నారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీలు సొంత పార్టీలోనే సీట్లు అడుక్కునే పరిస్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం దాట వేశారు. సీట్లపై పంథానికి పోవద్దంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు సంబంధించి ఢిల్లీలో జరిగిన సమావేశానికి తమను ఎందుకు పిలువలేదని, ఈ విషయంపై స్క్రీనింగ్ కమిటీ భక్త చరణ్దాస్, ఉత్తమ్కుమార్రెడ్డిని అడుగుతానన్నారు. దేశంలో ఎక్కడా లేని బీసీ సాధికారత కమిటీ తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకుని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, సాధికారత కమిటీ ఎందుకు పెట్టలేదని రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీశారు.