Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యానిఫెస్టో కమిటీ కో చైర్మెన్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చేనేత కార్మికుల సంక్షేమానికి టీపీసీసీ మ్యానిఫెస్టోలో చేనేత కార్మికులకు పెద్ద పీట వేయనున్నట్టు మ్యానిఫెస్టో కమిటీ కో చైర్మెన్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. ప్రతి చేనేత, పవర్లూమ్ కార్మిక కుటుంబానికి రూ 5 లక్షల ఆరోగ్య బీమా పథకం కూడా వర్తింపచేస్తామన్నారు. మంగళవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యాదాద్రి పవర్ ప్లాట్ ప్రాజెక్టును ఆపేస్తామన్నారు. మంత్రి జగదీష్రెడ్డి కమీషన్లకు కక్కుర్తి పడి ఆ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పర్యావరణానికి గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. కేంద్రం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నారని చెప్పారు.