Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యఆరోగ్యశాఖలోని నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గురువారంనాడు ఒక రోజు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఆలిండియా వైద్య ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఈ నిరసన చేస్తున్నట్టు తెలంగాణ వైద్యఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ షబ్బీర్ అహ్మద్ ఒక ప్రకట నలో తెలిపారు. ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్ పాలసీ, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం నిరస నకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. హైదరాబాద్లోని కోఠిలో జరిగే నిరస నకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.