Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షమించాలంటూ భర్తకు సూసైడ్నోట్
నవతెలంగాణ-కొణిజర్ల
ఆయుర్వేద వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతిలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం...ఖమ్మం పట్టణానికి చెందిన బొంగరాల వీణ(38) కొణిజర్ల మండల పరిధిలోని పెద్దగోపతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు పద్ధతిన ఆయుర్వేద వైద్యురాలిగా పనిచేస్తోంది. ఖమ్మంలో నివాసముంటూ పెద్దగోపతి పీహెచ్సీ ఆస్పత్రికి రాకపోకలు సాగిస్తోంది. రోజులాగే మంగళవారం కూడా విధులకు హాజరైంది. మధ్యాహ్నం ప్రాంతంలో ఆస్పత్రిలో ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేకలు పెట్టడంతో అక్కడున్న సిబ్బంది వెళ్లి చూడగా వీణ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలింది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఆస్పత్రిలోని సిబ్బంది సమాచారం అందించారు. ఎస్ఐ సీహెచ్.ఎల్లయ్య ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త వంగూరి శివశంకర్ హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యం
''డియర్ శివ... నిజంగా మీరు మిస్టర్ పర్ఫెక్ట్. మీరు, మన ఫ్యామిలీ అంతా బాప్తిశం తీసుకున్న రోజు నేను ఏ లోకంలో ఉన్నా నిజంగా సంతోషిస్తాను. మీరు భర్తగా రావడం నా అదృష్టం. నా పిల్లలు దేవుడు ఇచ్చిన అదృష్టం. మీకు తగ్గట్టుగా నేను ఉండలేకపోయాను. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నేను దేవుడి దగ్గరకు వెళ్తున్నా. పిల్లలు జాగ్రత్త'' అంటూ సూసైడ్ లేఖలో పేర్కొంది.