Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటరు అవగాహన వాహనాలను ప్రారంభించిన రావత్
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రజాస్వామ్యం మీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ తెలుసుకోండి.. అంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూపొందించిన ఓటరు అవగాహన వాహనాలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ మంగళవారం హోటల్ తాజ్ కృష్ణాలో జెండా ఊపి ప్రారంభించారు. అలాగే వికలాంగులు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలన్న దానిపై జీహెచ్ఎంసీ అధికారులు రూపొందించిన ప్రత్యేక యాప్ను కూడా ఆవిష్కరించారు.
ఓటర్లు తమ ఓటును ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఎన్నికల సిబ్బంది ఈ వాహనంలో వార్డుల్లో తిరిగి ఓటర్లకు అవగాహన కల్పిస్తారు. సాధారణ ఓటర్లతో పాటు వికలాంగులు, అంధులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం ఎలా? అన్న దానిపై వాహనంలో ఏర్పాటు చేసిన పరికరాలతో వారికి అవగాహన కల్పిస్తారు. ఓటరు అవగాహన వాహనంలో సమకూర్చిన ఆధునిక ఎన్నికల పరికరాలు, వీవీప్యాట్లను ఎన్నికల బృందంతో కలిసి ఓపీ రావత్ పరిశీలించారు. అంధులు, వికలాంగులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారన్న విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్, ఇతర ఎన్నికల అధికారులు రావత్కు వివరించారు.
దీనిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా ఓటర్లలో చైతన్యం కల్పించాలని సూచించారు.