Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) అఖిల భారత 16వ మహాసభలు హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాలో ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అఖిల భారత మహాసభల పోస్టర్ను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మాదం తిరుపతి, కార్యదర్శి కోట రమేష్ల నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 30 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు సిమ్లాలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు జరుగుతాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. పేదలను విద్యకు దూరం చేస్తోందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు ఫెలోషిప్లు రద్దు చేసి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోందని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తూ విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తోందని అన్నారు. ప్రతిష్టాత్మకమైన యూజీసీని రద్దు చేసి హెకీని తీసుకురావడం వల్ల విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుందని చెప్పారు. విదేశీ వర్సిటీలను ఆహ్వానించడం వల్ల దేశ సమగ్రత, సమతుల్యత కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించే విద్యావ్యతిరేక విధానాలతోపాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఈ మహాసభలకు 1,500 మంది ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. తెలంగాణ నుంచి 150 మంది ప్రతినిధులు వెళ్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు విజేత, ప్రకాశ్కరత్, నాయకులు మూర్తి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ ఫీజు గడువు పెంచాలి
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మాదం తిరుపతి, కార్యదర్శి కోట రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ అశోక్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంటర్ ఫీజు చెల్లింపు గడువు అపరాధ రుసుం లేకుండా బుధవారంతో ముగియనుందని తెలిపారు. బతుకమ్మ, దసరా సెలవులు రావడంతో విద్యార్థులు చాలా మంది ఫీజు చెల్లించలేకపోయారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు విజేత, ఎండి జావీద్, హైదరాబాద్ నగర అధ్యక్షుడు అశోక్రెడ్డి, నాయకులు క్రాంతి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.