Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయ విధానాలతో బీఎల్ఎఫ్
-తేరుకోని బీజేపీ
తెలంగాణ ముందస్తు ఎన్నికలకు కౌంట్డౌన్ షురూ అయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీలో..ఇంకా సీట్ల కేటాయింపులు పూర్తికాలేదు. ఇప్పటికే పలు జిల్లాల్లో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. గులాబీబాస్ తో పాటు అధినేత పంపిన దూతలు చేస్తున్న రాయబారాలు కొంతమేర ఫలిస్తున్నట్టు కనిపించినా..మాజీలను జనం నిలదీస్తున్నారు. వారికి సమాధానాలు చెప్పుకోలేక నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మరో వైపు మహాకూటమి సీట్ల వ్యవహారంలో స్తబ్దత నెలకొన్నది. అమిత్షా, కేంద్రమంత్రులు ఎన్నికల గోదాలో ప్రచారం చేసినా బీజేపీ లోపాయికారి ఒప్పందంతో..ఇక్కడ ఆ పార్టీ నాయకత్వం తేరుకోలేకపోతున్నది. ఇంకోవైపు ఇప్పటికే రెండు విడతలుగా సీట్లు కేటాయించిన బీఎల్ఎఫ్ ప్రత్నామ్నాయ విధానాలు అమలుచేస్తామంటూ ఓటర్ల దరికి చేరుతున్నది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రమంతా ఒకటే చర్చ. ముందస్తు ఎన్నికలు, దాని పర్యవసానాలు. రాజకీయ స్వార్థంతో ప్రజల మీద ఎన్నికల భారం మోపిన టీఆర్ఎస్లో అసమ్మతి తగ్గకపోగా, రోజు రోజుకు పెరుగుతున్నది. ఆ పార్టీ అభ్యర్థులను గ్రామాల్లో నుంచి వెళ్లగోట్టే పరిస్థితి నెలకొంది. అలాగే ప్రజాకూటమి కప్పల తక్కెడను గుర్తుకుతెస్తున్నది. ఇంకా కదలని బండిని తలపిస్తున్నది. సీట్ల పంచాయతీ తేలకముందే, ఒకటి, రెండు పార్టీలు తాము బయటకు పోతామని, లేదు లోపలే ఉంటామని గంటకో మాట, పూటకో విధానంలా వ్యవహరి స్తున్నాయి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమేన్న బీజేపీకి అడుగులు తడబడుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్తో అంతర్గతంగా ఓప్పందం చేసు కున్నా, రాష్ట్రంలో కమలం పార్టీకి సానుకూల పవనాలు వీయడం లేదు. కాషాయ రం గును ప్రజల కపోతాల్లో నింపి సొమ్ముచేసుకుందామను కున్న బీజేపీ నాయకత్వానికి కండ్లు బైర్లు కమ్మే పరిస్థితి కనపడుతున్నది. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్తో లోలో పల అంటకాగుతున్నా, నియోజకవర్గాల్లో కీలకనేతలకే దిక్కు లేని పరిస్థితి గోచరిస్తున్నది. ఈ రెండూ ఇలా ఉంటే, ప్రత్యా మ్నాయ విధానాలతో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఎలా పాటుపడాలో స్పష్టం చేస్తూ బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) ప్రజలముందుకొచ్చింది. సీట్ల
గొడవలు లేకుండా, కుమ్ములాటలకు అతీతంగా ప్రజాశ్రేయస్సే ఎజెండాగా అడుగులేస్తున్నది. ఎన్నికల ప్రచారమే కాకుండా, ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంది.
కూటమి..
ప్రజాకూటమిలో ఇప్పటికీ కేసీఆర్ రాజీనామా చేసిన తొలిరోజుల నాటి పరిస్థితే నెలకొంది. కనీస ఉమ్మడి కార్యక్ర మం సంగతి పక్కనబెడితే, అభ్యర్థులు ఎవరో ఇంకా తేల్చు కోని పరిస్థితుల్లో ఊగిసలాడుతున్నది. ఎక్కడ ఎవరూ అనే సంగతి తేలనేలేదు. ప్రధానంగా కాంగ్రెస్లో టికెట్ల కేటా యింపు ఓ యజ్ఞయే అయ్యేలా ఉన్నాయి ఆ పార్టీ పరిస్థి తులు. ఊ అంటే ఢిల్లీకి వెళుతున్నారు నేతలంతాఫైరవీల కోసం. గాడ్ఫాదర్ల చుట్టూ తిరుగుతూ తమ అధ్రుష్టాన్ని పరీక్షించునే పనిలో ఉన్నారు అభ్యర్థులు. అధిష్టానంలోని కీలక నేతలను నమ్ముకున్న వారూ ఉన్నారు. కాంగ్రెస్ కమిటీలేవీ ఉనికిలోకి రాలేదు.
ప్రచార కమిటికీ పనిలేకుండా పోయింది. సభలు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ కమిటీ చైర్మెనే పరేషాన్లో ఉన్నట్టు ప్రచారం జరు గుతున్నది. మిగతా కమిటీలన్నీ ఢిల్లీ చుట్టే తిరుగుతున్నా యి. ఇకపోతే కాంగ్రెస్లోని కీలకనేతలందరూ రెండు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి తనకు, మరోకటి తన కుటుంబంలోని మరోకరికి అంటూ ప్రతిపాదనలు పెట్టారు. ఒకవేళ ఆ ప్రతిపాదనను అధిష్టానం బుట్టదాఖలు చేస్తే, రెబెల్స్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు ఆ తల్లిదండ్రులు. ఇలా కాంగ్రెస్లో చాలామందే ఉన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీట్లు కాదు..కూటమే ముఖ్యమని హైదరాబాద్లో వ్యాఖ్యానిస్తే, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా మాత్రం తామూ అందుకు సిద్ధమని ఢిల్లీలో ఐక్యతారాగం వినిపించారు. టీజేఎస్, సీపీఐల సీట్లు తేలక అంతటా గందరగోళనం కనిపిస్తున్నది ఆ ప్రజా కూటమిలో.
కారు స్పీడ్ తగ్గిందా ?
కారు స్పీడ్లో తేడా వచ్చిందని ఆ పార్టీ నేతలే అంటు న్నారు. తెలంగాణ భవన్, ప్రగతిభవన్లో తరచుగా మీటింగ్లు జరుగుతున్నా, కిందిస్థాయిలో సఖ్యత కుదరడం లేదని చెబుతున్నారు. అధినేత పోన్లల్లో మాట్లాడుతున్నా పట్టించుకోని పరిస్థితి ఉందని అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల సమావేశంలో కీలకసూచనలు చేస్తారని భావిం చినా, చివరకు తుస్సుమనేలా జరిగిందని అంటున్నవారూ లేకపోలేదు. మన గెలుపునకు ఆసరా పింఛన్లే ఆధారం అంటూ అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సామూ హిక పథకాలు పెద్దగాలేకపోవడంతో వాటి గురించి అభ్య ర్థుల చెవిన వేయడానికి ఆయన ఇష్టపడలేదని సమాచారం. రాహుల్గాంధీ ప్రచారాన్ని అడ్డుకోవడానికే అభ్యర్థుల సమా వేశం పెట్టారనే గుసగుసలు అటు ప్రగతిభవన్తోపాటు ఇటు గాంధీభవన్లోనూ వినిపించాయి.
ఇంకో ముచ్చట ఏం టంటే కారు అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి పార్ల మెంటు సభ్యులు ససేమిరా అంటున్నారట. అసెంబ్లీ క్యాండి డేట్లు కాస్త ఎంపీలతో ఎడమెహం, పెడమోహంగా ఉంటు న్నారనే సంగతి వార్తాపత్రికలు ఇప్పటికే కోడైకూస్తున్నాయి. అక్కడ బంధం అతకడం లేదనే ప్రచారమూ సాగుతున్నది. బలాబలాల్లో తేడావచ్చిందనీ, ఇందుకు కేసీఆర్ మాటలే సాక్ష్యమని చెబుతున్నారు. గతంలో 105 సీట్లు మనవేనన్న కేసీఆర్, ఇప్పుడు 100సీట్లు గెలిస్తేనే సార్థకత అంటున్నారని, దీని అంతరంగం రాజీనామా తరువాత రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిందని చెప్పకనేచెప్పారని అంటున్నారు. అటు కాంగ్రెస్ ఒకడుగు ముందుకేసి టీఆర్ఎస్కు 25 నుంచి 30 నే వస్తాయని సీట్ల గురించి ముందస్తు జోస్యం చెబుతున్నది. ఇకపోతే బీజేపీ మాత్రం ఇంకా తేరుకోలేదు. అభ్యర్థులను ప్రకటించినా, ప్రచారంలో వెనుకే ఉన్నారు. జాతీయ నేతలతో మీటింగ్లు పెట్టినా, కిందిస్తాయిలో కదలడం లేదనే ఆందోళన హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కనిపిస్తున్నది.
ప్రత్యామ్నాయ విధానాలతో...
మహకూటమి, టీఆర్ఎస్లకు ప్రత్యా మ్నాయంగా బహుజన లెఫ్ట్ఫ్రంట్(బీఎల్ఎఫ్) ప్రజల ముందు కొచ్చింది. తమ విధానాలతో ఇన్నేండ్లుగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఏమీ ఓరగబెట్టలేదంటూ, కొత్త రాజకీయ ఒరవడిని సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. 29 పార్టీలకు నెలవైన బీఎల్ఎఫ్ ఇప్పటికే రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది.
సామాజిక న్యాయాన్ని పాటిం చింది. మహళలను ప్రొత్సహించింది. యువతకు అవకాశాలు ఇచ్చింది. మొ త్తం 56 అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఇప్పటిదాకా చట్టసభల్లోకి అడుగుపెట్టని ఆర కటికె, పూసల, సంచార జాతులకు సైతం టికెట్లు ఇచ్చి తన పారదర్శకతను, సామాజిక న్యాయం పట్ల తన నిబద్ధతను చాటుకుంది. బీసీలకు ముఖ్యమంత్రి, 60 అసెంబ్లీ సీట్లు, మహిళకు ఉప ముఖ్యమంత్రి , డ్వాక్రా సంఘాలకు 10 ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తామంటూ ప్రకటించింది. దళితులు, గిరిజనులు, బీసీ, మైనార్టీలు,విద్య, ఆరోగ్యం, సంక్షేమం, కార్మికులకు ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలు చేపడతామని ప్రకటించిం ది. నిరుద్యోగులకు తొలి ఆరు నెలల కాలంలో 2 లక్షల ఉద్యో గాలు భర్తీచేస్తామనీ, ఉద్యోగం దొరకని వారికి నిరుద్యోగ భృతి నెలకు రూ. 3000 ఇస్తామని తెలియజేసింది.