Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నిక
- అరుదైన రికార్డు సొంతం
- వరుసగా డబుల్ హ్యాట్రిక్
- ప్రతి గెలుపులోనూ భారీగా పెరిగిన ఓట్లు
- ప్రస్తుతం ప్రత్యర్థిపై 1,18,699 మెజార్టీ
నవతెలంగాణ-సిద్దిపేట ప్రతినిధి
రికార్డులకు రారాజుగా ఆపద్ధర్మ మంత్రి హరీశ్రావు నిలిచారు. 2014 ఎన్నికల్లో ఉన్న తన రికార్డును తానే బద్దలు కొట్టి 2018 సార్వత్రిక ఎన్నికల్లో మరో రికార్డు సాధించారు. ఆరుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు. మొదటి గెలుపు నుంచి ఇప్పటి వరకు ప్రతిసారీ భారీగా ఓట్లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏఅభ్యర్థీ సాధించని లక్షా 18వేల 699 మెజార్టీ సాధించి తిరుగులేని నాయకుడి గా అందరి అభినందనలు పొందాడు. హరీశ్ 2004లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి మొదటగా రాజకీయంగా ఆరంగేట్రం చేశారు. ఆయన మేనమామ, ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ 2004లో సిద్దిపేట నుంచి శాసనసభ్యునిగా, కరీంనగర్ ఎంపీగా గెలుపొందడంతో సిద్ది పేట అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. అనంతరం తన మేనల్లు డైన హరీశ్ను ఉపఎన్నిక పోటీలో నిలిపారు. అందులో మొదటి సారే 24వేల 594ఓట్లతో హరీశ్రావు విజయకేతనం ఎగురవేశారు. అనం తరం 2008 ఉప ఎన్నికల్లోనూ హరీశ్రావు 58వేల మెజార్టీతో గెలు పొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో 64 వేల 667 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2010లో తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయగా, మళ్లీ జరిగిన ఉపఎన్నికల్లో 93 వేల 858 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో 95 వేల 328 ఓట్ల మెజార్టీ సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో లక్షా 18 వేల 699 ఓట్ల మెజార్టీతో వరుసగా డబుల్ హ్యాట్రిక్ సాధించారు. హరీశ్రావుపై పోటీచేసిన ఇతర పార్టీల అభ్యర్థులు ఈసారి కూడా డిపాజిట్లు కోల్పోయారు.