Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యూనిఫైడ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలంపియాడ్( యూఐఈఓ)లో నారాయణ విద్యార్ధులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్షలో నారాయణ విద్యార్ధులు 2,3,5 తరగతుల్లో ఐదు ఆలిండియా ర్యాంకులు సాధించారు. దీంతో పాటు మొదటి పదిర్యాంకుల్లో 49 శాతం ర్యాంకులను, మొదటి 50లోపు ర్యాంకుల్లో 26శాతం, వందలోపు 52.5 శాతం ర్యాంకులు సాధించారనీ నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సింధూర నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతీ యేడాది రెండు నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తారనీ తెలిపారు. ఈ పరీక్షకు జాతీయ స్థాయిలో మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారనీ తెలిపారు. ఈ పరీక్షలో ఒక్క నారాయణ తప్ప మరే ఇతర విద్యాసంస్థ ఈ తరహా విజయాలను సాధించలేదన్నారు. నేటితరం విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీ పరీక్ష అయినా ఇంగ్లీష్లోనే నిర్వహిస్తారనీ అన్నారు. కనుకే నారాయణలో ప్రత్యేకంగా సాఫ్ట్స్కిల్స్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశామనీ తెలిపారు.