Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజరు ఇంటిపై దాడికి ఖండన :
- బీజేపీ నాయకుడు స్వామి పరిపూర్ణానంద
నవతెలంగాణ-కలెక్టరేట్
ప్రజస్వామ్యబద్ధంగా రాజకీయాలుండాలనీ, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజరు ఇంటిపై దాడిని ఖండిస్తున్నామనీ ఆ పార్టీ నాయకుడు పరిపూర్ణానంద అన్నారు. కరీంనగర్లోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజరుకుమార్ ఇంటిపై మంగళవారం మజ్లిస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడాన్ని ప్రజస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దనీ, మరోమారు దాడులు పునరావృతమైతే సహించేది లేదనీ హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాస సత్యనారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ పాల్గొన్నారు.