Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల తీర్పును గౌరవిస్తున్నా :
- మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణ-క్లాక్టవర్
నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారనీ, వెంటనే నల్లగొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలనీ కేసీఆర్ను మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. గురువారం నల్లగొండ పట్టణంలోని తన నివాసంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20ఏండ్లుగా నల్లగొం డను ఎంతో అభివృద్ధి చేశాననీ, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు పరిష్కరించాననీ అన్నారు. నాలుగు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రజా తీర్పును గౌరవిస్తానన్నారు. పదవి లేకున్నా ప్రజలకు సేవ చేయడంలో నిత్యం ముందుం టానని అన్నారు. నల్లగొండను కేసీఆర్ దత్తత తీసుకుంటానని చెప్పడం వల్లే టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఇక నుంచి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు సేవ చేస్తానన్నారు. సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాయకులు బుర్రి శ్రీనివాస్రెడ్డి, గుమ్ముల మోహన్రెడ్డి పాల్గొన్నారు.