Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకుల కార్ల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన తాళ్లూరి రవి, అనుమోలు సాంబశివరావు, కంఠమనేని రవి కార్లు ఆరుబయట ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అద్దాలు పగులగొట్టారు. వీఎంబంజరకు చెందిన రమేష్ ఇంటి పక్కనే ఉన్న గడ్డి వాముకు నిప్పు పెట్టారు. రాజకీయ కక్షలతోనే ఇటువంటి చర్యలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు.