Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో ప్రజాకూటమి భేటి: టీడీపీ అధ్యక్షులు రమణ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసి అధికార పార్టీ దూకుడును కొంతవరకు అడ్డుకోగలిగామని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్. రమణ అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటము లు సహజమని, ఓటమికి గల కారణాలపై సమీక్షించుకుంటామని ఆయన చెప్పారు. డిపాజిట్లు రావంటూ అధికారపార్టీ ఎద్దేవా చేసిందని, ఇప్పుడేం జరిగిందో చూశారుగా అంటూ చురకలంటించారు. ఏది ఏమై నా ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం కొనసా గిస్తామని స్పష్టం చేశారు. తెలుగుజాతి ప్రజలకోసం తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చిందని, దానికి చంద్రబాబు చొరవతీసుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి అభ్యర్థులు వీరోచి తంగా పోరాడారని, కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో నిర్విరామంగా కృషి చేశారని ఆయన కొనియాడారు. ప్రజాకూటమి సమావేశమం త్వరలో నే ఉంటుందన్నారు. 119 నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ప్రకటించారు. రాబోయే స్థానిక, పార్లమెంటు ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో పనిచేసేలా మా కార్యక్ర మాలు రూపొందిస్తామని చెప్పారు. దేశంలో ఏర్పడబోయే కూటమి విజ యానికి తమ వంతు కృషిచేస్తామని వివరించారు. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చే పార్లమెటు ఎన్నిల్లోనూ ఉంటుందన్నారు. దేశం లో చంద్రబాబు 14 పార్లీను ఏకతాటిపైకి తీసుకొచ్చారని అన్నారు. జాతి ప్రయోజనాల కోసం దేశంలో 14 పార్టీలను చంద్రబాబునాయుడు ఏకతాటిపైకి తీసుకొచ్చారన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు బండ్రు శోభారాణి, అధికార ప్రతినిధి ఎన్.దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అజ్మీర రాజునాయక్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎం.డి.యూసుఫ్ పాల్గొన్నారు.