Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెడరల్ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు
- విలేకరుల సమావేశంలో కేసీఆర్
- జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమ ముందున్న లక్ష్యం పంచాయతీ ఎన్నికలేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. వీటికోసం సమా యత్తం కావాలంటూ ఎమ్మెల్యేలకు దిశా, నిర్దేశం చేసినట్టు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలను ఖతం పట్టించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీలవి అవకాశవాద రాజకీయాలని విమర్శించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం బుధవారం తెలంగాణ భవన్లో పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు అవసరముందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని అన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాల ఫ్యూడల్ వైఖరి నశించనంత వరకూ దేశంలో సమూల మార్పులు రావని.. అలా జరగాలంటే ధైర్యం, సాహసం అవసరమని చెప్పారు. ఆ సాహసాన్ని తాను చేస్తున్నాని వివరించారు. ఈ విషయంలో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై ఈసీ గెజిట్ జారీ చేయాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. ఆ తర్వాతే నూతన ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆయన తెలిపారు. గురువారం తాను ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. వారి ఇండ్ల స్థలాల అంశాన్ని వీలైనంత తొందరగా పరిష్కరిస్తా మని తెలిపారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసే రోజు తనతో పాటు కొంతమంది మంత్రులు, ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో మరికొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని వివరించారు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. దేశంలో వందకు వందశాతం మ్యానిఫెస్టోను అమలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్సేనని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. యువతలో అపోహలు సష్టించే విధంగా కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు. వాస్తవానికి ప్రభుత్వరంగంలో ఉన్న ఉద్యోగాల కంటే ప్రయివేటు రంగంలోనే ఎక్కువని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాల సంఖ్య ఒక్క శాతం కంటే తక్కువేనని వివరించారు. ఇంటికో ఉద్యోగమి స్తానంటూ తానెక్కడా చెప్పలేదని అన్నారు. అయితే ఉద్యో గాల కల్పనకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. తమకంటే ముందు 60 ఏండ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయంటూ ప్రశ్నించారు. నిరుద్యోగులను మోసం చేసిన ఆ రెండు పార్టీలు కనీసం ఐదులక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అబద్ధాలతో ఆయా పార్టీలు యువతను మోసం చేశాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో.. వాటన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. తమ మ్యానిఫెస్టోలో చేర్చని అనేకాంశాలను తాము అమలు చేశామని ఆయన చెప్పారు. రైతుబంధు పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చలేదని గుర్తుచేశారు. కానీ దాన్ని అమలు చేశామని తెలిపారు. కొద్దిపాటి భూమి ఉన్న రైతు చని పోయినా అతడికి కూడా రైతుబీమాను వర్తింపజేస్తున్నామని వివరించారు. దీంతో చాలా కుటుంబాలకు ప్రయోజనం కలుగుతున్నదని చెప్పారు. రైతుబీమా.. తనకు అత్యంత సంతృప్తినిచ్చే పథకమని కేసీఆర్ వివరించారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా.. రాష్ట్రాభివద్ధి, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పార్టీగా తమకు ప్రజల్లో ఆదరణ లభించిందని తెలిపారు. కల్యాణలక్ష్మి పథ కంతో తెలంగాణలో దాదాపుగా బాల్య వివాహాలు ఆగిపో యాయని చెప్పారు. కేసీఆర్ కిట్తో ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని.. కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య కోటి దాటిందని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకా న్ని అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఇందుకు మూడు న్నర లక్షల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఫ్రంట్ అధికా రంలోకి వస్తే దీన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు. రాష్ట్రం ప్రస్తుతం 29.9 శాతం ఆర్థిక వద్ధితో ముందుకెళుతున్నదని..ఈ అంశంలో దేశంలోని మరే రాష్ట్రమూ తెలం గాణకు దరిదాపుల్లో లేదని చెప్పారు. రూ.70వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తామని చెప్పారు. అప్పులు చేస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన తోసిపుచ్చారు. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఏడాదిన్న రలో సీతారామ, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు.
రాష్ట్ర మంత్రివర్గంలో ఎంఐఎం చేరబోదని స్పష్టం చేశారు. నియంతృత్వం గురించి అడిగిన ప్రశ్నకు.. 'అలా లేకపోతే నన్ను కోటి సెంటర్లో రూపాయి పావలాకు అమ్మేస్తరు...' అని సమాధానమిచ్చారు. సమాచార పౌర సంబంధాలశాఖ ఈసారి కూడా తన దగ్గరే నిక్షిప్తంగా ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏప్రిల్ చివరినాటికి ప్రతీ ఇంటికీ నల్లా నీరిస్తామని స్పష్టం చేశారు.