Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలుపులు, కిటికీలు, వాహనం ధ్వంసం
నవతెలంగాణ-శాయంపేట
భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటిపై దాడి జరిగింది. నిందితులు గొడ్డళ్లు, కత్తులతో సదరు నాయకుడి ఇంట్లోకి చొరబ డ్డారు. ద్విచక్రవాహనాన్ని, ఇంటి కిటికీలను ధ్వం సం చేశారు. పోలీసుల రాకతో పరారయ్యారు. దాడి చేసినవారిలో ఒకరు టీఆర్ఎస్ నాయకుడు కాగా, ఇతరులు భూపాలపల్లి నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి బరిలో నిలిచిన గండ్ర సత్యనారాయణరావు అను చరులు కావడం గమనార్హం. భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించడంతో కాట్రపల్లి గ్రామ కమిటీ అధ్యక్షు డు రఘుసింగ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో అదే సమయంలో టీఆర్ఎస్ శ్రేణు లూ సంబరాలకు దిగారు. ఈ క్రమంలో రఘు సింగ్ మీద అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకుడు సదర్లాల్తోపాటు, గండ్ర సత్యనారాయణరావు అనుచరులు దేవేందర్, రాజేందర్ గొడవకు దిగారు. తోపులాట చోటుచేసుకుంది. సమా చారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అందరినీ అక్కడి నుంచి పంపిం చేశారు. అనంతరం ఇంటికెళ్లిన రఘుసింగ్పై గొడ్డళ్లు, కత్తులు, కట్టెలతో దాడికి యత్నించారు. తలుపులు, కిటీకీలు విరగ్గొట్టారు. ఇంటి ముం దున్న ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. సమా చారం అందుకున్న పోలీసులు అక్కడికి రావడ ంతో నిందితులు పరారయ్యారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి :
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రఘుసింగ్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఆయన బుధవారం ఉదయం గ్రామానికి చేరు కుని రఘుసింగ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లా డుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను గెలవ డాన్ని జీర్ణించుకోలేకే గ్రామ శాఖ అధ్యక్షుడిపై టీఆర్ఎస్ నాయకుడు సదర్లాల్, గండ్ర సత్యనా రాయణ అనుచరులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. కానీ రాజకీయ దాడులు సరికా దన్నారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుం బానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.