Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్
- నేడు మధ్యాహ్నం 1:25 గంటలకు రాజ్భవన్లో సీఎంగా ప్రమాణస్వీకారం
- ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
- క్యాబినెట్ రద్దును ఆమోదించిన గవర్నర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షులు కె.చంద్రశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్భవన్లో గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు కేసీఆర్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశమున్నది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం బుధవారం జరిగింది. టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 88మంది అభ్యర్థులు సమావేశానికి హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కష్టపడి గెలిచారని కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతాయుతంగా పని చేయాలని, ప్రభుత్వ ప్రాధా న్యాల మేరకు నడుచుకోవాలని సూచించారు. వచ్చే నెలలో జరిగే పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. అనంత రం వారితో కలిసి కేసీఆర్ భోజనం చేశారు.
టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆలేఖను టిఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కె.లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పద్మా దేవేందర్రెడ్డి, తదితరులు రాజ్భవన్లో గవర్న ర్కు అందజేశారు. ప్రభుత్వ రద్దుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ను కోరారు. ప్రభుత్వ రద్దుపై గవర్నర్ ఆమోదం తర్వాత నూతన శాసనసభ కొలువుతీరడానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదలచేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా టీఆర్ఎస్ ఎల్పీ నేత కేసీఆర్ను గవర్నర్ ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నట్టు కెేసీఆర్ రాజ్భవన్కు సమాచారం పంపారు. ఆమేరకు సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లు చేసింది.