Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈ నెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించాలని, విధిగా గ్రామ సభలు నిర్వహించి వచ్చే నాలుగేళ్ల కోసం ప్రణాళికలు తయా రు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్పీటర్, కమిషనర్ అనితా రాంచం ద్రన్, సీఎంఓ కార్యదరిశ నర్సింగ్రావు తదితరులతో కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామాల జనాభాను అనుసరించి ఆయా గ్రామాల్లో తయారైన ప్రణాళి కల ప్రకారం నిధులు విడదల చేయాలని సూచించారు. ఏ గ్రామానికి ఏ పని కోసం ఎన్ని నిధులు విడుదల చేశామని ప్రజలకు వివరించాలని చెప్పారు. గ్రామాల్లో చెత్త సేకరణ కోసం 25 వేల రిక్షాలు కొని జనాభా ప్రకారం గ్రామలకు పంపాలన్నారు. ఇదే కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటాలని వివరించారు. గ్రామజ్యోతి విధివిధానాల ముసాయిదాను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు.