Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పిం చాలని కోరుతూ శనివారం నుంచి బీసీ సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో అర శాతం తగ్గినా రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని హెచ్చరిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వ వెంటనే స్పందించాలని డిమాం డ్ చేస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన శుక్రవారం బీసీ భవన్లో బీసీ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని పార్టీలు రాజకీయంగా బీసీలను అణగదొక్కేందుకే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా, ఉద్యోగ రంగాల్లోనే 50 శాతం రిజర్వేషన్లు మించ కూడదన్న నిబంధన ఉన్నదని, కానీ రాజకీయాల్లో నిబంధనలు వర్తించవని చెప్పారు. బీసీ రిజ ర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించకపోవడం, శాశ్వ త పరిష్కారాన్ని చూపకపోవడం వల్లనే న్యాయ స్థానాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై వెంటనే స్పందించి రాజ్యాగంబద్ధత కల్పించేం దుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.