Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తమ్పై గజ్జెల కాంతం ఫైర్
- మీ నాయకత్వం మాకొద్దు
- పార్టీని సర్వనాశనం చేశారని వ్యాఖ్య
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసంతృప్తులు, తిరుగుబాట్లు మొదలయ్యాయి. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని పార్టీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ఉత్తమ్కుమార్రెడ్డి తీరు కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని రాహుల్గాంధీ ముందుకు తీసుకెళుతుంటే...పార్టీని సర్వనాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా నైతిక బాధ్యత వహిస్తానంటూ చెప్పిన ఉత్తమ్...తక్షణం అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుందని, ఇప్పుడు 19 సీట్లకే పరిమితమైందన్నారు. బీసీలు పీసీసీ ప్రెసిడెం ట్గా పనికిరారని చెప్పి పొన్నాలను రాజీనామా చేయించారని, అదే సూత్రం ఉత్తమ్ కుమార్రెడ్డికి ఎందుకు వర్తించడం లేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఉత్తమ్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లామని, అక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లే వచ్చాయన్నారు. కూటమి ఏర్పాటు విషయంలోను ఉత్తమ్ కుమార్రెడ్డి జాతీయ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారని విమర్శించారు. రాహుల్గాంధీని ప్రజలు నమ్మారు కానీ, ఉత్తమ్ను నమ్మడం లేదని చెప్పారు. ఉద్యమకారుడు కానుందునే ప్రజలు కూడా ఆయన నాయకత్వాన్ని తిరస్కరిం చారని చెప్పారు. మైహోం రామేశ్వరరావుతో ఆయనకు ఒప్పందాలు జరిగిగాయని, అందువల్లే కాంగ్రెస్ అభ్యర్ధులను ఆలస్యంగా ప్రకటించారని ఆరోపించారు.
గజ్జెలకు షోకాజ్ నోటీసులు
ఇదిలావుంటే టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతంకు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మెన్ కోదండరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉత్తమ్కుమార్రెడ్డి, పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.