Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్రాంతి తర్వాత పల్లె పోలింగ్
- తర్వాత పల్లె పోలింగ్బీసీ రిజర్వేషన్లపై మల్లగుల్లాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొత్త సర్కారు మెడకు రిజర్వేషన్ల ''పంచాయతీ'' చుట్టుకుంది. 34 శాతానికి తగ్గిస్తే సహించబోమంటూ బీసీలు, 50 శాతానికి మించొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశిం చడంతో ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం ..విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలంటూ పంచాయతీరాజ్ చట్టం 2018లో ప్రభుత్వం పొందుపర్చింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టు రాజకీయ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని ఆదేశించడంతో ప్రభుత్వానికి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు చేయాలంటే బీసీల వ్యతిరేకత వస్తుందని, ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు సమస్యలు వస్తాయని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. బీసీలకు నచ్చజెప్పడమా? లేక కోర్టు ఆదేశాలను పాటించడమా? అని మల్లగుల్లాలు పడుతున్నది.
రాష్ట్రాలకే స్వేచ్ఛ
1993లో 73-74 రాజ్యాగ సవరణ చేసినప్పుడు ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రకారం విధిగా రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిబంధన విధించింది. కాని బీసీ రిజర్వే షన్ల విషయంలో మాత్రం ఆయా రాష్ట్రాల స్వేచ్ఛకే వదిలే సింది. బీసీ రిజర్వేషన్లకు ఇప్పటికీ రాజ్యాంగబద్ధత కల్పించ కపోవడం వల్లనే ప్రతిసారి పంచాయతీ ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల సమస్య ముందుకు రావడం, వాటిపై అగ్రకు లాలు కోర్టులను ఆశ్రయించడం పరిపాటిగా జరుగుతున్నది. 2008, 2012 లోనూ బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై ఒక నిర్ణయానికి రాలేదు. 34 శాతం రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని దేశ వ్యాప్తంగా బీసీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ వాటికి శాశ్వత పరిష్కారం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్టే తీసుకువచ్చి 2013లో పంచాయతీ ఎన్నికలను జరిపింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్ల పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించి అమలు చేయకుంటే ఎస్సీలకు 20, ఎస్టీలకు 8 శాతం రిజర్వేషన్లు పోనూ బీసీలకు మిగిలేది కేవలం 22 శాతం రిజర్వేషన్లు మాత్రమే. రాష్ట్ర జనాభాలో సుమారు 2కోట్ల మంది బీసీలు ఉన్నట్టు సమాచారం. దీనివల్ల వేలాది మంది బీసీలు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
మొదటికే మోసం
రిజర్వేషన్లను 34 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని ఎన్నో ఏండ్లుగా బీసీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో రాజ్యాంగ సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ బీసీ సంఘాలు కోరుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు నోరుమెదకపోవడం, అలక్ష్యం చేయడంతో సమస్య మరింత ముదిరింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మొదటికే మోసం వచ్చిందని బీసీలు ఆవేదన చెందుతున్నారు.
కొత్తగా రెండో సారి అధికా రంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభు త్వానికి బీసీ రిజర్వే షన్లు కత్తిమీద సాములా మార నుందా అనే సందే హాలు వ్యక్తమవుతు న్నాయి. పంచా యతీరాజ్ చట్టం 2018లో పొందు పర్చినట్టు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుంటే బీసీలకు అన్యాయం చేసినట్టు అవుతుందని, ఇదే క్రమంలో కోర్టు తీర్పును ధిక్కరించే అవకాశం లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందా? ఆ తీర్పుపై ''స్టే' తీసుకురావచ్చా అన్న అంశాలపై సర్కారు న్యాయనిపుణులతో చర్చిస్తున్నది. ఒకవేళ వీలుకాని పక్షంలో ఇంకా ఇతరత్ర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అన్న దాని గురించి పంచాయతీ రాజ్ శాఖ అధికారులు కుస్తీ పడుతున్నారు.
సంక్రాంతి తర్వాతనే..
ముందస్తు ఎన్నికలో అత్యధిక స్థానాలతో గెలుపొందిన టీఆర్ఎస్ అదే ఊపును పంచాయతీరాజ్ ఎన్నికల్లో కొనసాగించాలన్న ఆలోచనలో ఉంది. ప్రజల మనస్సులో నుంచి ఎన్నికల వేడి తగ్గకముందే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రమంతా టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలుస్తారన్న ధీమాతో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సంక్రాతి పండుగ మరుసటి రోజే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
కసరత్తు షురూ
పంచాయతీ ఎన్నికలు, రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ రాజ్ఎన్నికలపై గత రెండు రోజులగా కుస్తీ పడుతున్నది.
ఇప్పటికే ఆశాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్తో పలు దఫాలుగా చర్చలు నిర్వహించారు. ప్రధానంగా రిజర్వేషన్ల సమస్యకు ఈ నెలాఖరుకు కల్లా తెర దించి జనవరిలోనే పంచాయతీలకు కొత్త సర్పంచ్లను ఎన్నుకోవాలన్న ఆలోచనలో ఉంది. బడ్జెట్ రూపకల్పన కన్నా ముందే పంచాయతీలు కొలువు తీరితే బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించాలన్న స్పష్టత కూడా వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.