Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురికి గాయాలు
నవతెలంగాణ-వడ్డేపల్లి
శుభకార్యానికి పోతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరు మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు స్టేజీ రాధాస్వామి మందిరం మార్గమధ్యలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..
మానవపాడు మండలం మెన్నిపాడుకు చెందిన యువతికి, వడ్డేపల్లి మండలం జిల్లెడుదిన్నెకు చెందిన యువకునితో వివాహం నిశ్చయమైంది. ఇందులో భాగంగా అమ్మాయి తరుపు వారు చెక్కెర భోజనం చేసేందుకు అబ్బాయి ఇంటికి వెళ్లారు. సుమారు 20 మందితో ట్రాక్టర్లో తిరుగు పయన మయ్యారు. ఈ క్రమంలో పైపాడు స్టేజీ దాటాక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోంకూర్కు చెందిన బోయ మద్దిలేటి(52), మెన్నిపాడుకు చెందిన వెంకటేశ్వరమ్మ(38) అక్కడిక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని బంధువులు కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.