Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులుండవు : సీఎం కేసీఆర్
- ఆరు నెలల్లోగా జిల్లాల్లో పార్టీ ఆఫీసులను నిర్మించాలి :
- టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్
- కేటీఆర్ ఆధ్వర్యంలో నేడు మరోసారి భేటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'అన్నింటా పార్టీదే పై చేయి ఉండాలి. నియోజకవర్గా లను సైతం శాసనసభ్యులు కాదు.. పార్టీయే శాసించాలి.. ఆ విధంగా టీఆర్ఎస్ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి' అని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా, నిర్దేశం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగి న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజర య్యారు. ఈ సమావేశానికి కార్యవర్గ సభ్యులతోపాటు ఎమ్మె ల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భం గా కేటీఆర్ను రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... ఇక నుంచి పార్టీ వ్యవహారాలన్నింటినీ కేటీఆర్ చూసుకుంటారని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని.. కార్యనిర్వా హక అధ్యక్షుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతిజిల్లాలో టీఆర్ఎస్ కార్యాలయం ఉండా లని చెప్పారు. ఆరు నెలల్లోగా అన్ని జిల్లాల్లో ఆఫీసుల నిర్మా ణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తనతోపాటు పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు జాతీయ రాజకీయాలు, ప్రభు త్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటారని చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రజాపోరాటాలు, సైద్ధాంతిక పోరుకు కార్యకర్తలు, నేతలంతా సిద్ధంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. పార్టీ ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చే విధంగా కృషి చేయాలని కోరారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులకు ఇప్పటి నుంచి గుర్తింపు కార్డులను అందజేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పినట్టు తెలిసింది. ఈ కార్డు ఉన్నవారు పార్టీ అధ్యక్షుణ్ని ఎప్పుడైనా కలవొచ్చని ఆయన తెలిపినట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలెవరికీ కార్పొరేషన్ పదవులు ఇవ్వబోమని వాటన్నింటినీ పార్టీ నేతలకే కట్టబెడతామని ఆయన చెప్పారు. జిల్లాల్లో నిర్మించబోయే పార్టీ ఆఫీసుల్లోని మొదటి అంతస్తులో రాష్ట్ర అధ్యక్షుడి కోసం ఓ ఛాంబర్ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పార్టీకి అత్యంత విధేయు డు, నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడైన వ్యక్తినే స్పీకర్ పదవికి ఎంపిక చేస్తామంటూ కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. గతంలోని మంత్రులందరికీ ఈసారి ఆ పదవులు రాకపోవచ్చని.. అయినా బాధపడొద్దని సూచించినట్టు వినికిడి. శనివారం మధ్యాహ్నం కేటీఆర్ నేతత్వంలో మరోసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఆ భేటీకి కూడా అందరూ హాజరు కావాలంటూ కేసీఆర్ ఆదేశించారు.
కేటీఆర్ను కలిసేందుకు తహతహ...
వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన కేటీఆర్ను కలిసేందు కు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ను క్యూ కట్టారు. ఇప్పటి వరకూ మంత్రులుగా పనిచేసిన సీనియర్లు, ఎమ్మెల్యేలు సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు తహతహలాడటం గమనార్హం. తద్వారా ఆయన దృష్టిలో పడేందుకు వారందరూ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమైంది.
ఇంతవరకేనా...? ఇకపై కూడానా...?
మరోవైపు ఇప్పటి వరకూ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన తన తనయుడు కేటీఆర్కు.. కేసీఆర్ ఇక ముందు కూడా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్ద పీట వేస్తారనే చర్చ జరుగుతున్నది. ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయటానికే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవినిచ్చారనే వాదన కూడా బలంగా వినబడుతున్నది. ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో... 'మీరు జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెడితే, సీఎం పదవిని వేరే వారికి అప్పగిస్తారా...?' అంటూ ఒక పాత్రికేయుడు కేసీఆర్ను ప్రశ్నించారు. దానికి ఆయన... 'అలాంటి సంద ర్భం వస్తే.. పార్టీలో చర్చిస్తాం' అని సమాధానమిచ్చారు. అంతేతప్ప తానే సీఎంగా ఉంటానని చెప్పకపోవటం గమ నార్హం. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు.. కేటీఆర్ను సీఎం చేయటానికి ఉన్న అవకాశాలను మరింతగా బలపరుస్తున్నా యని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.