Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.రాములు, చావ రవి వెల్లడి
నవతెలంగాణ-క్లాక్టవర్
ఈ నెల 30, 31, జనవరి ఒకటో తేదీల్లో ఖమ్మంలో నిర్వహించనున్న టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర తృతీయ మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.రాములు, చావ రవి కోరారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. నాలుగున్న రేండ్లలో విద్యారంగంలో జరిగిన పరిణామాలను సమీక్షించుకుని రాబోయే రోజుల్లో విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయుల సమస్యల పరి ష్కారం కోసం మహాసభలో ప్రణాళిక రూపొం దించను న్నట్టు తెలిపారు.
కర్తవ్యాలను నిర్ణయించుకుని పోరాట కార్య క్రమాలను రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో నూత నంగా ఎంపికైన మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు ఈ సభలకు హాజరవుతున్నట్టు తెలిపారు.
రెండోసారి సీఎంగా ఎన్నికైన కేసీఆర్ను రాష్ట్ర కమిటీ తరపున అభినందించారు. సర్వీస్రూల్స్ సమస్యలు పరిష్కరించాలనీ, పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలనీ కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు ఎంఎకే.దత్తు, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఆర్.ధన మూర్తి, జిల్లా కోశాధికారి పి.వెంకటేశం, జీవీ.నర్సింహారావు పాల్గొన్నారు.