Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సచివాలయంలోని ముఖ్య కార్యదర్శుల శాఖల్లోనూ మార్పులు
రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ తన పాలనను మరింత సమర్ధవంతంగా, పారదర్శకంగా అందించేందుకు గాను రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేపట్టనున్నట్టు తెలిసింది. సచి వాలయంలోని శాఖా ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల శాఖల్లోనూ మార్పులను చేపట్టబోతున్నది. కొత్త మంత్రివర్గం కొలువుదీరిన తర్వా త బదిలీలు, మార్పులు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు నిర్ణయించారు. కొత్తగా ఎన్నికైన సూచనల మేరకు జిల్లా కలెక్టర్లు, మంత్రి వర్గంలోకి వచ్చే వారి అభ్యర్థన మేరకు సచివాయలంలోని ము ఖ్య కార్యదర్శుల శాఖలను కూడా మారుస్తున్నట్టు సమాచారం. మంత్రివర్గంలో చోటు ఖాయం అనుకున్న వారితో కొందరు ముఖ్య కార్యదర్శులు వారితో సమావేశమై తన మంత్రిత్వ శాఖకు ముఖ్య కార్య దర్శిగా నియమించాలని కోరినట్టు తెలిసింది. ముందస్తు ఎన్నికల్లో కొందరు కలెక్టర్లు ప్రతిపక్ష పార్టీలకు సహకరించారన్న సమాచారం ప్రభుత్వానికి చేరింది. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లనుంచి పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ల బదిలీల గురించి సీఎం కె చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించినట్టు తెలిసింది. వారి స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై కూడా ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. అలాగే ప్రభుత్వంపైన అసహనం వ్యక్తం చేసిన ఐఏఎస్లపై సీఎం కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. ఈ సారి వారిని ప్రాధాన్యత గల శాఖలో నియమించనున్నారు. తన ప్రభుత్వంలో అందరినీ సమానంగా చూడాలని సీఎం సీఎస్ను ఆదేశించినట్టు తెలిసింది. మరో వారంలో ఐఏఎస్ల బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని సచివాలయంలోని ఒక ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.