Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయవ్యవస్థ కలుషితం
- ఎన్నికల ఫలితాల్లో ప్రజావ్యతిరేకత ప్రస్ఫుటం
- మోడీపై భ్రమలు పూర్తిగా తొలిగిపోయారు
- నేడు, రేపు కేంద్ర కమిటీలో తాజా రాజకీయ పరిస్థతిపై చర్చ :
- పొలిట్బ్యూరో సమావేశంలో బివి రాఘవులు వెల్లడి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
భారత న్యాయ వ్యవస్థను కూడా బీజేపీ కలుషితం చేసిందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘ వులు తెలిపారు. మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చి న తీర్పు చాలా ప్రమాదకరమైందని అభివర్ణించారు. లౌకిక రాజ్యంలో అలాంటి తీర్పులు ఇచ్చి మత సామరస్యానికి భంగం కలిగించేందుకు సదరు న్యాయమూర్తి యత్నిస్తున్నా రని ఆరోపించారు. న్యాయ వ్యవస్థలో కూడా మతోన్మాద భావజాలం కలిగినవారు ఉన్నారని చెప్పడానికి ఆ న్యాయ మూర్తి వ్యాఖ్యలే నిదర్శమని అన్నారు. భారత్ ఎప్పుడూ లౌకిక రాజ్యమేనని ఉద్ఘాటించారు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా ప్రస్ఫుటమైందని చెప్పారు. తాజా ఫలితాలతో దేశ ప్రజానీకంలో మోడీపై ఉన్న భ్రమలు పూర్తిగా తొలిగిపో యాయని వివరించారు. శుక్రవారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలో రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చించినట్టు తెలిపారు. శని,ఆదివారాల్లో జరగబోయే పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ప్రత్యేకంగా డ్రాఫ్టును తయారు చేసినట్టు వెల్లడించారు. అధికార పార్టీలపై స్థానిక ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొందని వెల్లడించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ, మతోన్మాదంతో ముందుకు వెళ్ళాలని యోచించడం బాధాకరమన్నారు. సున్నిత విషయాలను రెచ్చగొట్టడం ద్వారా అసంతృప్తిని కొంతమేర తగ్గించాలని భావించిందని అన్నారు. ఆ చర్యలు ఎన్నికల్లో పూర్తిమేర పని చేయలేదని చెప్పారు. అయితే, భవిష్యత్లో కూడా అవే ఎత్తుగడ లను బీజేపీ ఉపయోగించే ప్రమాదం ఉన్నదన్నారు. అందుచేత, లౌకిక శక్తులు అప్రమత్తంగా బీజేపీ ఎత్తులను గట్టిగా తిప్పికొట్టాలని చెప్పారు. అంతర్జాతీయంగా అమెరికా దుడుకుతనం పెరుగుతుందని ఆరోపిం చారు. వాణిజ్య యుద్ధం సంభవించకుండా చేయాలని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని, అయితే అమెరికా మాత్రం ట్రేడ్వార్ను కొనసా గించేందుకు చర్యలు చేపడుతున్నదని విమర్శించారు. ఈ విషయంలో పొలిట్బ్యూరో ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. ట్రేడ్వార్ లేకుండా వాణిజ్య ఒప్పందాలు జరిగే విధంగా అన్ని దేశాలు అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.