Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సర్కారు సమాలోచన
- న్యాయసలహా కోరిన పాఠశాల విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధ నలపై ఏం చేయాలనే దానిపై తెలంగాణ సర్కారు సమాలోచన చేస్తున్నది. ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాదనీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పాఠశా ల విద్యాశాఖ న్యాయసలహా కోరినట్టు తెలిసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు న్యాయశాఖను సంప్రదించినట్టు సమాచారం. న్యాయ శాఖ సూచనల మేరకు ప్రభుత్వ అనుమతితో పాఠశాల విద్యాశాఖ ఓనిర్ణయానికి వచ్చే అవకాశ ముంది. ఏకీకృతసర్వీసు నిబంధనలు చెల్లవని హైకోర్టు ఆదే శాలను అమలు చేయ కపోవడంపై ఆగ్రహంవ్యక్తం చేసింది. ఎందుకు అమలు చేయలేదని పాఠశాల విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది. శాశ్వత ఉద్యోగులనీ, ఇలాగైతే జైలుకు పం పాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణకు ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈనేపథ్యంలో ఏంచేయాలనే దానిపై విద్యాశాఖ అధికా రులు మల్లగుల్లాలు పడుతున్నారు. సుప్రీంకోర్టును మళ్లీ ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. న్యాయశాఖ సూచనతర్వాతే ఓనిర్ణయానికి వచ్చే అవకాశమున్నది.