Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇవాళ కారు జోరు ఉండొచ్చు..రేపు రిపేర్కు రావొచ్చు :
- మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో క్యాడర్ అధైర్యపడొద్దని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. ఇవాళ కారు జోరు ఉండొచ్చని...రేపు రిపేర్ కావొచ్చని వ్యాఖ్యా నించారు. టీఆర్ఎస్కు బీజేపీ తోకపార్టీ అని విమర్శించారు. 105 మంది బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ రాలేదని...ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తాళం వేసుకో వాలని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓ స్టాండ్ అంటూ లేదని అన్నారు. ఓటమితో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడరాదన్నారు. ప్రజల్లో ఉంటూ సమస్య లపై కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు పార్టీ నేతలు పోరాటం చేయాలన్నారు.
బీసీలను అణచివేస్తున్నారు: వీహెచ్
బీసీలను అణచివేస్తే సహించేది లేదని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. ఓటర్ల జాబితాను సక్రమంగా తయారు చేయాలని, 2019 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు.