Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వా హక అధ్యక్షులుగా నియమి తులైన కెటి రామరావుకు తెలంగాణ ప్రయివేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాల సంఘం శుభాకాంక్షలు తెలిపింది. శని వారం హైదరాబాద్లో కేటీఆర్ను సంఘం అధ్యక్షులు ఎస్విసి ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఎ పరమేశ్వర్, నాయకులు టి నరేందర్రెడ్డి, సిద్ధేశ్వర్ తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. ప్రయివేటు విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి గతంలోనూ నిరంతరం తోడ్పాటునందించారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయివేటు జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రత్యేక బడ్జెట్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు సకాలంలో చెల్లించేందుకు శ్రద్ధ చూపాలని కోరారు. ప్రయివేటు కాలేజీ యాజ మాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.