Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి సహకార శాఖ ప్రతిపాదన
- ఆయా శాఖలకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి
- బోగస్ ఓటర్ల ఏరివేతపైనా దృష్టి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్) ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఓటర్ల జాబితాల సవరణపై దృష్టిపెట్టిన సహకార ఎన్నికల మండలి జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు కలెక్టర్లు, ఎస్పీలు సహకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్నికల నిర్వహణకు సంబంధం ఉండే ప్రభుత్వ శాఖలకు జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలిచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో వచ్చే రెండు నెలల్లోగా సహకార ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
లింగ్ బూత్ల గుర్తింపునకు సన్నాహాలు
ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్న ఎన్నికల మండలి ముందుగా పోలింగ్ బూత్ల గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 905 సంఘాలు ఉండగా, వాటికి ఎన్నికలు నిర్వహిం చేందుకు అందుబాటులో పోలింగ్ బూత్లను గుర్తించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు ఇతర ప్రభుత్వ భవనాలను ఎంపిక చేసి, అక్కడ మౌలిక వసతు లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎన్నికల సిబ్బం ది, బందోబస్తు తదితర ఏర్పాట్లకు కావాల్సిన ప్రభుత్వ సిబ్బంది కేటాయింపు పూర్తిగా కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ శాఖల అధిపతుల చేతుల్లో ఉంటుంది. దీంతో ప్రభుత్వం నుంచి వారికి నేరు గా ఆదేశాలు అందితే ఆపై జిల్లాల స్థాయిలో కార్యా చరణ ప్రారంభించాలని భావి స్తున్నారు.
బోగస్ ఓటర్ల ఏరివేతపైనా..
రైతుల ముసుగులో కొందరు ఓటువేసే అవకాశాలు ఉన్నాయని, వారిని గుర్తించాల్సింది క్షేత్రస్థాయిలో ఉన్న రైతులేనని సహకార మండలి సూచించింది. రుణాలకోసం, రాయితీలు పొందేందుకు కొందరు దొడ్డిదారిన రైతులుగా నమోదు చేసుకుని లబ్ధిపొందుతున్నారనే ఆరోపణలున్నాయి. 2013లో జరిగిన ఎన్నికల అనంతరం రైతుల జాబితాల పరిశీలన, ఓటర్ల జాబితా రూపకల్పన ఇప్పుడే చేపడుతుండటంతో స్థానిక ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే జిల్లా సహకార సంఘం ఉన్నతాధికారులకు సూచించాలని మండలి కోరుతున్నది. ఈ నెలాఖరునాటికి బోగస్ ఓటర్లను తొలగించి జాబితాలను ఖరారు చేయనున్నట్టు తెలిసింది.
ఎన్నికల నిర్వహణకు ఒక్కో ప్యాక్స్కు
రూ. లక్ష కేటాయింపు
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు (ప్యాక్స్) రూ.లక్ష చొప్పున కేటా యించాలని జిల్లా సహకార శాఖ అధికారు లను (డీసీఓ) ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో సంఘం పరిధిలో ఎన్నికల నిర్వహణకు వీలు గా సంఘంలో ఉన్న నిధులను ముందస్తుగా వినియోగించుకునే అధికారం ఇవ్వాలని, ఆర్థిక స్థితి సక్రమంగా లేని ప్యాక్స్కు అంత మొత్తం ముందస్తుగా కేటాయించేందుకు ఏర్పాట్లు చేయాలని డీసీసీబీలను ఆదేశించింది. డీసీ సీబీలు కూడా చెల్లించలేని పక్షంలో టీఎస్కాబ్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్య దర్శి పార్థసారథి శుక్రవారం జీవో ఆర్టీ నెం. 815ను విడుదల చేశారు. ఎన్నికల అనం తరం ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవాలని సంబంధిత సంస్థలకు సూచించారు.